4 వీక్షణలు

ఫిఫా ప్రపంచకప్: రొనాల్డో కన్నీటి వీడ్కోలు.. పోర్చుగల్‌ కథ ముగిసె!

ఫిఫా ప్రపంచకప్: రొనాల్డో కన్నీటి వీడ్కోలు.. పోర్చుగల్‌ కథ ముగిసె!

 ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ ప్రయాణం ముగిసింది. క్వార్టర్‌ఫైనల్స్‌ బెర్తు కోసం స్పెయిన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 1-0 తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇది తన చివరి ప్రపంచకప్‌ అని ప్రకటించిన పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo).. ఈ ఓటమితో తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యాడు.

 

హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో స్పెయిన్ తరఫున మైకెల్ మెరీనో ఏకైక గోల్‌ను సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో స్పెయిన్ జట్టు క్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా నిలిచిన రొనాల్డోకు ఈ మ్యాచ్‌తో ప్రపంచకప్ కెరీర్‌కు తెరపడినట్లయ్యింది.

 

మ్యాచ్ అనంతరం మైదానం నుంచి వెళ్తూ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు అభిమానులను కలచివేశాయి. తన చివరి ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవాలన్న రొనాల్డో కల అసంపూర్ణంగానే మిగిలిపోయింది. కాగా, 2010లో ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత స్పెయిన్ క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ట్యాగ్‌లు: #FIFA ప్రపంచ కప్ 2026 #FIFA వరల్డ్ కప్ షాక్ #క్రిస్టియానో రొనాల్డో #క్వార్టర్‌ఫైనల్స్ #పోర్చుగల్ #ఫిఫా ప్రపంచకప్ #ఫిఫా ప్రపంచకప్ 2026 #ఫుట్‌బాల్ #రొనాల్డో కన్నీటి వీడ్కోలు #రొనాల్డో చివరి ప్రపంచకప్ #స్పెయిన్

ఈ కథనాన్ని షేర్ చేయండి: