తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లాకు అధికారికంగా లేఖ రాశారు. కొండా సురేఖ వ్యవహారశైలి, వివాదాల నేపథ్యంలో ఆమెను తక్షణమే క్యాబినెట్ నుంచి తొలగించాలని సీఎం సిఫార్సు చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కొంతకాలంగా కొండా సురేఖకు సంబంధించి చోటుచేసుకుంటున్న పరిణామాలు, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే అంశాలను కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించిన అధిష్టానం, ఆమెను తొలగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అధిష్టానం నిర్ణయం మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు గవర్నర్కు లేఖ పంపారు. సీఎం లేఖపై గవర్నర్ తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ పరిణామంతో కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.